తండ్రి 98వ జయంతి సందర్భంగా అమ్మ నాన్న అనాధ ఆశ్రమంలో అన్నదానం
తన తండ్రి 98వ జయంతి సందర్భంగా పండిటి రాజశేఖర్ అనే వ్యక్తి అమ్మ నాన్న అనాధ ఆశ్రమంలో అన్నదానం చేశారు.
సికింద్రాబాద్ నుంచి వచ్చిన ఆయన మధ్యాహ్నం భోజనానికి విరాళం ఇచ్చారు. ఈ ఆశ్రమం ఎంతో మంది అనాథలను చేరదీసి చూస్తుండటం, భవన నిర్మాణం, నిర్వహణ చాలా బాగుందని ఆయన ప్రశంసించారు.
తాను సివిల్ ఇంజనీర్ని, రిజిస్టర్డ్ వాల్యూర్ని అయినందున నాణ్యత గురించి చెప్పగలనని ఆయన తెలిపారు. భవిష్యత్తులో కుటుంబ సభ్యులతో చర్చించి ఆశ్రమానికి మరిన్ని విరాళాలు అందిస్తానని రాజశేఖర్ చెప్పారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com