మూసీ ప్రాజెక్టు ఫేజ్-1 కు పర్యావరణ అనుమతి
మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు మొదటి దశకు తెలంగాణ పర్యావరణ అనుమతి లభించింది. రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచన అథారిటీ (SEIAA) ఈ నెల 5వ తేదీన ఫేజ్-1 కు ముందస్తు అనుమతులు మంజూరు చేసింది.
ఈ అనుమతితో మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియ వేగంగా జరుగుతోంది. దసరా పండుగలోపు టెండర్లు పిలిచి, ఆ తర్వాత నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
మొత్తం 55 కిలోమీటర్ల మేర హైదరాబాద్లో ప్రవహించే మూసీ నదిని అభివృద్ధి చేయాలన్నది ప్రాజెక్టు లక్ష్యం. దీన్ని ఐదు జోన్లుగా విభజించగా, మొదటి జోన్లోని 21 కిలోమీటర్ల మేర ఫేజ్-1 కింద పనులు చేపట్టనున్నారు. ఈ పనులు రెండేళ్లలో, అంటే 2027 డిసెంబర్ లేదా 2028 ప్రారంభం నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం ప్రాజెక్టును 2030 నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com