2029 నాటికి ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ లక్ష్యం: మంత్రి నారాయణ
మంత్రి నారాయణ నెల్లూరులోని ఆరణి కందప్ప మేస్త్రీ సత్రంలో RO వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. అనంతరం సంతపేట ఆంజనేయ స్వామి ఆలయ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2029 నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి శుద్ధి చేసిన నీటి కుళాయి కనెక్షన్ ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఉపరితల జలాలను శుద్ధి చేసి సరఫరా చేయడంపై దృష్టి పెట్టినట్లు చెప్పారు.
ఈ ప్రాజెక్టుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, అమృత్ 2.0, అమృత్ 2.1 నిధులతో రూ.14 కోట్లతో వాటర్ వర్క్స్ ప్రారంభమైనట్లు మంత్రి వివరించారు. ఈ పనులు పూర్తయితే 2029 నాటికి అన్ని ఇళ్లకు కుళాయి ద్వారా స్వచ్ఛమైన నీరు అందించగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com