మెడికో ప్రియాంక కేసు: నిందితులకు మూడు రోజుల పోలీస్ కస్టడీ
రాజమండ్రి మెడికో ప్రియాంక కేసులో నిందితులను మూడు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. రేపు ఉదయం 11 గంటల నుంచి ఈ నెల 21వ తేదీ ఉదయం 11 గంటల వరకు పోలీసులు వారిని విచారించవచ్చు.
ప్రస్తుతం నిందితులు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. పోలీసులు మరింత విచారణ కోసం కోర్టును పోలీస్ కస్టడీ కోరారు. కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
రేపు ఉదయం 11 గంటలకు నిందితులను ప్రకాష్ నగర్ పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారు. ASP, CI బాజీలాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం విచారణ జరపనుంది. DSP పర్యవేక్షణలో విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com