తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు — వచ్చే వారం మరింత తీవ్రత
ఆంధ్రప్రదేశ్లో పిడుగురాళ్ళలో 48.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది రాష్ట్రంలో అత్యధిక స్థాయి.
బాపట్ల జిల్లా వేటపాలెంలో 47.6°C, కృష్ణా జిల్లా నందివాడలో 47.6°C, NTR జిల్లా తొర్రగుడిపాడులో 47.4°C నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా అద్దంకిలో 47.4°C, ఏలూరు జిల్లా అల్లిపల్లిలో 47.3°C రికార్డు అయింది. మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 46.6°C, పోలవరం జిల్లా కూనవరంలో 46.5°C, నెల్లూరు జిల్లా కావలిలో 46.4°C, గుంటూరు జిల్లా తెనాలిలో 46°C నమోదయ్యాయి.
తెలంగాణలో నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో 46.5°C అత్యధికంగా నమోదైంది. హనుమకొండ జిల్లా ధర్మసాగర్లో 46.4°C, కరీంనగర్ జిల్లా చొప్పదండిలో 46.4°C, ఖమ్మం జిల్లా పెనుబలిలో 46.3°C నమోదయ్యాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 46.2°C, ములుగు జిల్లా ఏటూరు నాగారంలో 46.1°C, నల్గొండ జిల్లా కట్టంగూరులో 46°C, వరంగల్ జిల్లా నల్లబల్లిలో 46°C, జయశంకర్ జిల్లా మొగుళ్ళపల్లిలో 45.8°C రికార్డు అయింది.
వచ్చే వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com