సీఎం రేవంత్రెడ్డి కీలక ప్రకటన.. టీచర్లకు ఫిన్లాండ్లో శిక్షణ
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల టీచర్లను ఫిన్లాండ్ దేశానికి శిక్షణ కోసం పంపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
విద్యార్థులకు ప్రపంచ స్థాయి బోధన పద్ధతులతో పాఠాలు చెప్పేందుకు ఈ కార్యక్రమం ఉద్దేశించినట్లు ఆయన తెలిపారు. ఒక కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన, మారుమూల గ్రామాల పిల్లల సామర్థ్యం ఎక్కువగా ఉన్నా వారికి సరైన దృక్పథం లేకపోవడం వల్ల నష్టపోతున్నారని అన్నారు.
తెలంగాణలో 12 వేల గ్రామాలు ఉన్నాయని, ఆయా గ్రామాల పిల్లల భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రపంచ విద్యా విధానాలను టీచర్లు స్వయంగా చూసొస్తే ఆ అవగాహన సహజంగా తరగతి గదిలో బోధనలో ప్రతిఫలిస్తుందని ముఖ్యమంత్రి వివరించారు.
వచ్చే ఐదేళ్లు పూర్తిగా విద్యారంగంపైనే దృష్టి పెడతామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంపై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com