రూ.50.73 కోట్లతో తెలంగాణలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రారంభం
సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాలను పెంచేందుకు రూ.50.73 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో కలిసి ఈ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్లను గురుకుల విద్యార్థులు, హాస్టల్ విద్యార్థులు, స్కూల్ విద్యార్థులకు పంపిణీ చేశారు.
క్రీడా ప్రాజెక్టుల కింద రాష్ట్రంలోని వివిధ జిల్లాలో రూ.36.65 కోట్లతో మినీ స్టేడియాల నిర్మాణం, గచ్చిబోలి ఎల్బీ స్టేడియంలో రూ.14.08 కోట్లతో బాలబాలికల క్రీడా శిక్షణ కోసం అకాడమీల ఏర్పాటు చేపట్టనున్నారు.
అలాగే, సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియం ఆధునీకరణకు రూ.10 కోట్లు, నారాయణపేట జిల్లా నర్వా మండలంలో మినీ స్టేడియం నిర్మాణానికి రూ.4 కోట్లు, వనపర్తి జిల్లా ఆత్మకూరులో మల్టీ పర్పస్ స్టేడియం, కబడ్డీ, వాలీబాల్ కోర్టుల నిర్మాణానికి రూ.4 కోట్లు కేటాయించారు.
కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో రూ.3.50 కోట్లతో మినీ స్టేడియం, మెదక్ జిల్లా నర్సాపూర్లో రూ.2.65 కోట్లతో మినీ స్టేడియం, నారాయణపేట జిల్లా మక్తల్ మండలం ఉట్కూరులో రూ.2.50 కోట్లతో వాలీబాల్, కబడ్డీ కోర్టు నిర్మాణం చేపట్టనున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com