హైదరాబాద్ మెట్రో ఫేజ్-2: పాత బస్తీ కారిడార్ పనులు వేగవంతం చేయాలని సీఎం రేవంత్ ఆదేశం
హైదరాబాద్లో మెట్రో రైలు రెండో దశ పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పాత బస్తీ మెట్రో కారిడార్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్లో రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. అదే సమయంలో మెట్రో నిర్మాణానికి సంబంధించి టెండర్ ప్రక్రియను మొదలు పెట్టాలని సూచించారు. మెట్రో విస్తరణకు అడ్డంకులుగా ఉన్న భూసేకరణ పనులు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పారు.
ప్రయాణికుల రద్దీ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో మెట్రో రైళ్లకు అదనపు భోగీలు జోడించాలని, అందుకు అవసరమైన కొత్త కోచ్ల కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ 7.5 కిలోమీటర్ల కారిడార్ నిర్మాణంలో టెక్నాలజీ విషయంలో ఢిల్లీ మెట్రోను సంప్రదించి సలహాలు తీసుకోవాలని సీఎం సూచించారు.
సమీక్ష సమావేశంలో డిసెంబర్లో ప్రతిపాదించిన గ్లోబల్ సమ్మిట్ తదితర అంశాలు, పెట్టుబడుల ఆకర్షణపై కూడా చర్చించారు. మొత్తంగా మెట్రో విస్తరణను వేగంగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com