ఆగస్టు నుంచి ఏపీలో సంజీవని ఆరోగ్య పథకం అమలు: చంద్రబాబు
CM చంద్రబాబు నాయుడు సంజీవని ఆరోగ్య పథకాన్ని ఆగస్టు నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించారు.
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని ఆసుపత్రిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఈ విషయం తెలిపారు. ప్రతి పౌరునికి ఒక డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించనున్నట్లు, కుటుంబ సభ్యులందరికీ హెల్త్ ఐడీలు జారీ చేస్తామని ఆయన చెప్పారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజల ఆరోగ్య సమాచారాన్ని ఒకే వేదికపై అనుసంధానం చేస్తామని వివరించారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్య బాధ్యతను స్వీకరించేలా ఈ పథకాన్ని రూపొందించామని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com