సింహాచలంలో స్వాతి నక్షత్రం సందర్భంగా స్వాతి హోమం నిర్వహణ
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా 29న స్వాతి హోమం నిర్వహించనున్నారు. ఆలయ వార్షిక కళ్యాణ వేదికపై మహా హోమాన్ని నిర్వహిస్తామని దేవస్థానం EO తెలిపారు.
ఈ హోమం వల్ల భక్తులకు సకల శుభాలు కలుగుతాయని ఆలయ స్థానాచార్యులు డాక్టర్ టి.పి. రాజగోపాల్ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, అన్నవరం సత్యదేవుని ఆలయంలో పల్లకీ సేవ నిర్వహించారు. ఉదయం రాజగోపురం ముందు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పల్లకీలో కొలువుదీర్చి పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆలయం చుట్టూ మూడుసార్లు పల్లకీ సేవ జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com