భద్రాద్రి కొత్తగూడం జిల్లాలో SIR ఓటరు జాబితా సవరణ కొనసాగుతోంది
భద్రాద్రి కొత్తగూడం జిల్లాలో ప్రత్యేక తీవ్ర సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతోంది. ఓటరు జాబితాలను అప్డేట్ చేసేందుకు అధికారులు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు.
జిల్లాలో మొత్తం 1,104 పోలింగ్ కేంద్రాలుండగా, వాటికి BLO లను నియమించారు. 123 మంది సూపర్వైజర్లు సర్వేలో పాల్గొంటున్నారు. జిల్లాలో మొత్తం 9,96,198 మంది ఓటర్లు ఉన్నట్టు అధికారులు తెలిపారు.
2002 నాటి ఓటర్ల జాబితాను ఆధారంగా తీసుకుని 80 శాతం మ్యాపింగ్ ఇప్పటికే పూర్తయినట్టు చెప్పారు. ఈ ప్రక్రియలో భాగంగా కొత్తగూడెం నియోజకవర్గంలోని పాల్వంచ మండలంలో ఈరోజు నుండి సర్వే ప్రారంభమైంది.
పాల్వంచ మండలంలో 90 పోలింగ్ స్టేషన్లు ఉండగా, 90 మంది BLO లకు నిన్న ఎన్యుమరేషన్ ఫారాలను పూరించే విధానంపై శిక్షణ ఇచ్చారు. ఈరోజు 79 పోలింగ్ స్టేషన్ల పరిధిలో BLO లు ఇంటింటికి వెళ్లి ఫారమ్లు పంపిణీ చేశారు.
సర్వేలో రెండు ఫారమ్లు ఉంటాయి. ఒకటి ఆఫీసుకు సమర్పించగా, రెండోది కుటుంబ సభ్యులకు సంతకం చేయించి ఇస్తారు. అలాగే QR కోడ్ స్కాన్ చేసి వివరాలను అప్డేట్ చేస్తున్నారు. 2002 నాటి జాబితాలో లేని వారి వివరాలను ప్రత్యేకంగా నమోదు చేస్తారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో మ్యాపింగ్ త్వరలో పూర్తవుతుందని అధికారులు తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com