సైబర్ మోసాలపై హెచ్చరిక: ఆధార్, OTP షేర్ చేయవద్దని సిరిసిల్ల SP
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే సైబర్ మోసాలపై ప్రజలను హెచ్చరించారు. ఆధార్ కార్డు, ఓటీపీ, బ్యాంక్ వివరాలు ఎవరు అడిగినా చెప్పవద్దని సూచించారు.
జిల్లా పోలీసులు అంబేద్కర్ చౌకు నుండి బతుకమ్మ ఘాటు వరకు కళాశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఏపీకే యాప్లు, ఫ్రాడ్ ఫోన్ కాల్స్ ద్వారా జరిగే మోసాలపై అవగాహన కల్పించారు.
ఎస్పీ మాట్లాడుతూ, సోషల్ మీడియాలో అమ్మాయిలు తమ అకౌంట్లను ప్రైవేటుగా ఉంచుకోవాలని సూచించారు. పబ్లిక్ అకౌంట్ల ద్వారా ఫొటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉందని హెచ్చరించారు.
"తిరంగా సైబర్ సురక్ష" పేరుతో డీజీపీ, సైబర్ బ్యూరో ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ప్రారంభమైందని ఎస్పీ తెలిపారు. రేపటి నుండి ప్రతి మండలం, గ్రామ పంచాయతీలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com