వాతావరణం

రేపు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు; రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు వర్షాలు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
రేపు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు; రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు వర్షాలు
📷 Francesco Ungaro / Pexels
షేర్ కాపీ అయింది ✓

నైరుతి ఋతుపవనాలు రేపు కేరళను తాకనున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ఏడాది మే 16 నాటికే అండమాన్ నికోబార్ దీవులను చేరిన ఋతుపవనాలు మొదట అనుకున్న మే 26 కి బదులు కొంత ఆలస్యంగా కేరళను చేరుతున్నాయి.

కేరళలో ప్రవేశించిన తర్వాత, రెండు రోజుల్లో ఈ రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలకు విస్తరిస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అయితే, ఈ సీజన్‌లో మొత్తం వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదు కావచ్చని IMD సూచించింది. ఎల్నినో ప్రభావం కారణంగా రుతుపవనాలు బలహీనపడే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో వర్షపాతం ఏకరీతిగా ఉండదని, ఉత్తర, దక్షిణ ప్రాంతాలతో పోలిస్తే మధ్య జిల్లాల్లో తక్కువ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా.

అయితే, దీర్ఘకాల సగటు లెక్కల ప్రకారం వర్షాభావం గురించి తీవ్ర ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని అధికారులు తెలిపారు. ఖరీఫ్ సీజన్‌పై ఎల్నినో ప్రభావం ఎంత ఉంటుందనేది వ్యవసాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com