చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర క్షేత్రంలో 12 జ్యోతిర్లింగాల దర్శనం
చౌటుప్పల్ (తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకేచోట దర్శించే అవకాశం ఉంది. ఇక్కడికి హైదరాబాద్ నుంచి వచ్చిన భక్త బృందం ఈ ప్రత్యేకతను చూసి ఆనందం వ్యక్తం చేసింది. 12 జ్యోతిర్లింగాలకు ఒకేసారి కుటుంబ సభ్యులంతా అభిషేకం చేసుకోవచ్చు.
ఆలయ ప్రాంగణంలో శ్రీ జయసిద్ధి గణపతి, శ్రీ మాణిక్యం దేవి ఆలయాలు కూడా ఉన్నాయి. ప్రశాంత వాతావరణంలో ఎలాంటి రుసుం లేకుండా ధార్మిక కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయని భక్తులు తెలిపారు.
దాతల సాయంతో నిర్మితమైన ఈ ఆలయం పూర్తి స్థాయి నిర్మాణానికి ఇంకా సహకారం కావాల్సి ఉంది. భక్తులు తమ వంతు సాయం అందించవచ్చునని నిర్వాహకులు కోరారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com