తమిళనాడు సీఎం 300 కొత్త బస్సులు ప్రారంభించి, 28 లక్షల మంది విద్యార్థులకు ఉచిత ప్రయాణం
తమిళనాడు ముఖ్యమంత్రి ఈరోజు 300 కొత్త RTC బస్సులను ప్రారంభించారు. చెన్నైలోని సచివాలయం సమీపంలో డీజిల్-సీఎన్జీ బస్సులను జెండా ఊపి ఆయన ప్రారంభించారు.
తర్వాత ముఖ్యమంత్రి స్వయంగా బస్సులో ప్రయాణించారు. టికెట్ కోసం డబ్బులు చెల్లించి ప్రయాణం చేశారు. ప్రయాణికులతో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా, నేటి నుంచి ఆర్్టీసీ బస్సుల్లో విద్యార్థులకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. దాదాపు 28 లక్షల మంది విద్యార్థులకు ఈ సౌకర్యం లభిస్తుందని తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com