ఎస్ఎస్ఆర్ సమీక్షించిన తెలంగాణ కాంగ్రెస్.. అర్హుల ఓట్ల రక్షణపై ఆదేశాలు
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎస్ఎస్ఆర్ (Special Summary Revision) ప్రక్రియను సమీక్షించారు. ఎంపీలు, పార్లమెంట్ ఇన్ఛార్జీలు, ఎస్ఎస్ఆర్ కోఆర్డినేటర్లతో గాంధీ భవన్లో జూమ్ ద్వారా ఈ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఇందులో పాల్గొన్నారు.
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎస్ఎస్ఆర్ పురోగతిని నాయకత్వం క్షుణ్ణంగా పరిశీలించింది. బూతుల వారీగా ఓటర్ల జాబితా పరిశీలన, బీఎల్ఓల పనితీరు, అర్హులైన ఓటర్ల వివరాల ధృవీకరణ వంటి అంశాలను సమీక్షించారు. పనితీరు మెరుగుపరచాల్సిన ప్రాంతాల్లో సంబంధిత ఇన్ఛార్జీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
పట్టణ, నగర ప్రాంతాల్లో ఎస్ఎస్ఆర్ ప్రక్రియపై మరింత ప్రత్యేక దృష్టి పెట్టాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన అర్హులైన ఏ ఒక్క ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా ఉండేలా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.
ఈ సమావేశంలో పెండింగ్లో ఉన్న మండల కమిటీల నియామకాలను వెంటనే పూర్తి చేయాలని నిర్ణయించారు. రాబోయే ఎన్నికలకు ఎస్ఎస్ఆర్ ప్రక్రియను పునాదిగా కాంగ్రెస్ భావిస్తోందని, పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని ఆదేశించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com