హైదరాబాద్ మెట్రోలో త్వరలో ఆర్టీసీ తరహా మంత్లీ పాసులు
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు త్వరలో మంత్లీ పాసులు అందుబాటులోకి రానున్నాయి. ఆర్టీసీ బస్ పాసుల తరహాలో మెట్రో పాసులను ప్రవేశపెట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ప్రస్తుతం మూడు కారిడార్లలో రోజుకు 5 లక్షల మంది మెట్రో ప్రయాణిస్తున్నారు. పాసులు వస్తే మరో లక్షన్నర మంది వినియోగించుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మెట్రోతో పాటు ఆర్టీసీ కలిపి కంబైన్డ్ పాస్ ఇచ్చే అంశంపై కూడా అధ్యయనం జరుగుతోంది.
ప్రతి ట్రిప్కు విడివిడిగా టికెట్ కొనడంతో ఆఫీసు, కాలేజీకి రోజూ వెళ్లేవారికి ఖర్చు ఎక్కువవుతోంది. పాసులు ఇస్తే రవాణా ఖర్చు తగ్గుతుందని, సమయం ఆదా అవుతుందని ప్రయాణికులు ఆశిస్తున్నారు. మెట్రో వేగంగా, సురక్షితంగా ఉండడంతో వారికి ఇది మేలు చేస్తుందని భావిస్తున్నారు.
ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరడమే ప్రధాన లక్ష్యంగా అధికారులు పేర్కొన్నారు. మెట్రో సేవల మెరుగు కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఈ పాసులపై త్వరలో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com