హైదరాబాద్లో అక్రమ డంపింగ్ నియంత్రణకు ప్రభుత్వం కఠిన ఆదేశాలు
హైదరాబాద్లో అక్రమ డంపింగ్ నిరోధించేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
GHMC, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు HYDRA జలమండలి, HMDA, TGI, R&B వంటి అన్ని సంస్థలు కేంద్ర నిర్మాణ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు-2020 ని పాటించాలని మెట్రోపాలిటన్ ఏరియా అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
బహిరంగ ప్రదేశాలు, జలాశయాలు, నాలాలు, డ్రైనేజీలలో వ్యర్థాలు వేయరాదని స్పష్టం చేసింది. అధీకృత వాహనాల ద్వారా మాత్రమే వ్యర్థాలను తరలించాలని సూచించింది. కొత్త లేఅవుట్లు, భవనాలకు అనుమతులు ఇచ్చే ముందు సంబంధిత సంస్థలు వ్యర్థాల నిర్వహణ ప్రణాళిక సమర్పించాలని, దానిని అమలు చేస్తేనే ఎన్ఓసీ ఇవ్వాలని ఆదేశించింది.
ప్రభుత్వ పనుల్లో కాంట్రాక్టర్లు నిబంధనల ప్రకారం వ్యర్థాల నిర్వహణ పూర్తి చేస్తేనే బిల్లులు చెల్లించాలని పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాల జప్తు, అనుమతుల రద్దు వంటి కఠిన చర్యలు తీసుకోవాలని శాఖ హెచ్చరించింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com