తెనాలిలో బాలికలపై వేధింపుల ఫిర్యాదుతో తహసిల్దార్, సీఐ మారువేషంలో నిఘా
గుంటూరు జిల్లా తెనాలిలోని కొత్తపేట గర్ల్స్ హై స్కూల్ వద్ద ఓ యువకుడు బాలికలను వేధిస్తున్నాడన్న ఫిర్యాదుపై తహసిల్దార్ గోపాలకృష్ణ, సీఐ రాంబాబు రంగంలోకి దిగారు.
ప్రతి రోజు స్కూల్కు వచ్చే విద్యార్థులను ఓ యువకుడు అడ్డుకుంటున్నాడని బాలికలు తహసిల్దార్కు ఫిర్యాదు చేశారు. అతను అడ్రస్ అడుగుతున్నట్టు నటించి సెల్ ఫోన్లో అసభ్యకరమైన వీడియోలు చూపిస్తున్నాడని తెలిపారు.
దీంతో తహసిల్దార్, సీఐ ముఖానికి మాస్క్, నెత్తిన టోపీ పెట్టుకుని సామాన్య పౌరుల్లా స్కూల్ పరిసరాల్లో నిఘా పెట్టారు. అనుమానిత యువకుడు అక్కడికి రాగా, ఓ విద్యార్థిని అతన్ని గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com