టీజీఎస్ ఆర్టీసి ఎలక్ట్రిక్ ఆటోలతో ఫస్ట్ మైల్-లాస్ట్ మైల్ కెనెక్టివిటీ ప్లాన్
టీజీఎస్ ఆర్టీసి ప్రయాణికులకు ఫస్ట్-మైల్ టు లాస్ట్-మైల్ కనెక్టివిటీని అందించేందుకు ఎలక్ట్రిక్ ఆటోలను ప్రవేశపెట్టే ఆలోచన చేస్తోంది. ఈ కాన్సెప్ట్ ద్వారా, ప్రయాణికుడు ఇంటి నుంచి గమ్యస్థానం వరకు ఒకే టికెట్ తో ప్రయాణించవచ్చు.
ఇంటి నుంచి బస్టాప్కు ఆటో, బస్సులో ప్రయాణం, గమ్యం తర్వాత మళ్ళీ ఆటో — అన్నీ ఒకే బుకింగ్లో కలిపి చేయొచ్చు. ప్రస్తుతం టీజీఎస్ ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటో తయారీ సంస్థలతో చర్చలు జరుపుతోంది. ఈ ప్లాన్ ఇంకా అమలు దశకు చేరలేదు.
టీజీఎస్ ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది, దీంతో వీరు టికెట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం రాకపోవచ్చు. అలాగే, పురుషులు సాధారణంగా లోకల్ బస్సుల్లో నేరుగా ఎక్కిన తర్వాతే టికెట్ తీసుకుంటారు, ముందే బుక్ చేసుకోరు. ఈ అంశాలను ఎలా స్ట్రీమ్లైన్ చేస్తారన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
టీజీఎస్ ఆర్టీసీ ఇప్పటికే వెబ్సైట్, యాప్ ద్వారా టికెట్ బుకింగ్ సదుపాయం కల్పిస్తోంది. ఆటో కంపెనీలతో చర్చలు విజయవంతమైతే, టికెటింగ్ వ్యవస్థను మరింత అభివృద్ధి చేసి, ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణ సౌకర్యం అందించవచ్చని ఆర్టీసీ భావిస్తోంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com