సూర్యాపేట జిల్లాలో మూడు బస్సులు ఢీకొని 10 మందికి గాయాలు
సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపామల గ్రామం వద్ద మూడు బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, ఒక RTC బస్సు ఉన్నాయి.
ప్రమాదంలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మూడు బస్సులు రోడ్డుపై అడ్డంగా పడడంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై సుమారు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com