అధ్యక్షుడు ట్రంప్ త్వరలో భారత్ రానున్నారా? Trade Deal కీలక దశలో
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చేసిన తాజా వ్యాఖ్యల ప్రకారం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది ప్రారంభంలో భారత్లో పర్యటించే అవకాశం ఉంది. ఈ పర్యటనకు సంబంధించిన ప్రణాళికలు ఇప్పటికే సిద్ధమవుతున్నాయని ఆయన వెల్లడించారు.
ఇరు దేశాల మధ్య నెలలుగా కొనసాగుతున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరుకుందని రూబియో తెలిపారు. కొన్ని కీలక అంశాలపై చర్చలు పూర్తయితే త్వరలోని అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఈ ఏడాది చివరిలో తాను భారత్కు వచ్చి ట్రంప్ పర్యటన ఏర్పాట్లను సమీక్షించే అవకాశం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు.
ట్రంప్ పర్యటనలో వాణిజ్య ఒప్పందం, రక్షణ సహకారం, సెమీకండక్టర్ తయారీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కీలక ఖనిజాల సరఫరా, ఇంధన భద్రత వంటి అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని ఎదుర్కొనడం, క్వాడ్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, రక్షణ రంగంలో సంయుక్త ఉత్పత్తి వంటి అంశాలు కూడా చర్చకు రావచ్చు.
ట్రంప్ చివరిసారిగా 2020 ఫిబ్రవరిలో భారత్లో పర్యటించారు. అప్పుడు అహ్మదాబాద్లో 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి రోడ్షో నిర్వహించారు.
ప్రస్తుతం ట్రంప్ పర్యటన తేదీలు అధికారికంగా ఖరారు కాలేదు. కానీ రూబియో వ్యాఖ్యలతో ఈ పర్యటనపై చర్చలు వేగం పుంచుకున్నాయని, రెండో ట్రంప్ సందర్శన ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com