కాళేశ్వరం : ప్రాజెక్టులు ప్రభుత్వానివి, వ్యక్తులవి కాదు – విశ్రాంత ఇరిగేషన్ ఇంజనీర్ వి. ప్రకాష్
విశ్రాంత ఇరిగేషన్ ఇంజనీర్ వి. ప్రకాష్ కాళేశ్వరం ప్రాజెక్టు నీటి నిర్వహణపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టును ఏ ఒక్క నాయకుడు సొంతంగా నిర్మించలేదని, ప్రభుత్వం ప్రజా నిధులతో నిర్మిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
"కేసీఆర్ కట్టారో, రేవంత్ రెడ్డి కట్టారో కాదు. ప్రభుత్వ యంత్రాంగం, ఇంజనీర్లు, అధికారులు కలిసి నిర్మించారు. విధానాలను విమర్శిస్తే సరిపోతుంది కానీ వ్యక్తిగతం చేయడం సరికాదు" అని ఆయన తెలిపారు.
ఇటీవల కురిసిన వర్షాలు కాళేశ్వరం ఆయకట్టుకు సరిపోవని, శ్రీరామసాగర్ ప్రాజెక్టు (SRSP) లో నిల్వ పెంచుకోవాల్సిన అవసరం ఉందని ప్రకాష్ వివరించారు. ప్రాజెక్టు మొత్తం నిల్వ సామర్థ్యం 112 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 84 టీఎంసీల వరకు నింపే అవకాశం ఉందని, కనీసం 60 టీఎంసీలు అవసరమని చెప్పారు. రివర్స్ పంపింగ్ ద్వారా రోజుకు గరిష్టంగా ఒక టీఎంసీ చేయగలమని అంచనా వేశారు.
వర్షాలు తగ్గితే రానున్న రెండున్నర నెలల పంట కాలంలో ప్రతి వారం రెండుసార్లు నీరు అందించాల్సి ఉంటుందని, శ్రీరామసాగర్ కెనాల్ ద్వారానే సాగునీరు వెళ్లాలని ఆయన సూచించారు. హైదరాబాద్ తాగునీరు, పరిశ్రమల అవసరాలకు కొండపోచమ్మ నింపుకోవడం, ఎల్లంపల్లి నిల్వ నుంచి ఎన్టీపీసీ, మిషన్ భగీరథకు నీటి అందించాల్సిన అవసరాలు ఉన్నాయన్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com