విశాఖ స్టీల్ ప్లాంట్లో బ్లాస్ట్ ఫర్నెస్-3లో ప్రమాదం తప్పింది; ఉత్పత్తి పునరుద్ధరణ
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోని బ్లాస్ట్ ఫర్నెస్-3లో ఉత్పత్తి జరుగుతున్న సమయంలో పెను ప్రమాదం తప్పింది. మెటల్ బయటకు రావడం ఆగిపోవడంతో ప్రమాద ఘంటికలు మోగాయి. అధికారులు వెంటనే రంగంలోకి దిగారు.
ఫర్నెస్లోని హోల్స్ తెరుచుకోవడంతో గట్టపడిన మెటల్ కరిగిందని అధికారులు గుర్తించారు. దీంతో భారీ నష్టం, ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం తప్పిందని కార్మికులు తెలిపారు. రాత్రి 9 గంటల నుంచి ఉత్పత్తి యథావిధిగా కొనసాగింది.
ఈ స్టీల్ ప్లాంట్లో ఇటీవల జరిగిన వరుస ప్రమాదాల్లో 10 మంది చనిపోయారు. ఇప్పటికీ చాలామంది గాయాలతో చికిత్స పొందుతున్నారు. నాణ్యత లేని ముడి పదార్థాలు వాడటం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని, యాజమాన్యం నాణ్యమైన ముడి పదార్థాలు వాడాలని వారు డిమాండ్ చేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com