మెట్టుగూడలో యూత్ లీగ్ క్లబ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
సికింద్రాబాద్లోని మెట్టుగూడలో యూత్ లీగ్ క్లబ్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
యూత్ లీగ్ క్లబ్ వ్యవస్థాపకులు దివంగత డాక్టర్ పి. మల్లికార్జునరావు మనవడు, న్యాయవాది పోగుల సిద్ధార్థ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు.
అనంతరం విద్యార్థులకు నోట్బుక్లు పంపిణీ చేశారు. ప్రతి కుటుంబానికి విద్య, ఆరోగ్యం, ఉపాధి అందాలని పోగుల సిద్ధార్థ అన్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com