116 ఏళ్ల నవనీతమ్మ తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడకన
తమిళనాడుకు చెందిన 116 ఏళ్ల వృద్ధురాలు నవనీతమ్మ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని కాలినడకన చేరుకుని దర్శించుకున్నారు. ఆమె నడిచి వస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో విషయం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లింది. ఆమె భక్తి యువతతో పాటు అందరికీ స్ఫూర్తిదాయకమని చంద్రబాబు సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు.
దీనిపై స్పందించిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు, నవనీతమ్మ కుటుంబ సభ్యులను సంప్రదించి తన కోటాలో వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు. దర్శనం అనంతరం ఆమెకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
టీటీడీ అధికారులు చూపిన సహకారానికి నవనీతమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. నవనీతమ్మ తమిళనాడు నుంచి పాదయాత్రగా తిరుమల చేరుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com