మందమరరిలో ఘనంగా బోనాల జాతర
మంచిర్యాల జిల్లా మందమరలో బోనాల జాతర ఘనంగా జరిగింది.
కేకేవన్ సీఎస్పీ సమీపంలోని దుర్గా భవాని ఆలయంలో ఆలయ అర్చకుడు సతీష్ భవాని ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. పరాభవ నామ సంవత్సరం ఆషాఢ మాసం చివరి రోజు కావడంతో మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో తరలి వచ్చారు.
డప్పు చప్పులు, డీజే పాటలతో యువతీ యువకుల నృత్యాలు, పోతరాజుల విన్యాసాలు కార్మిక కాలనీలను కోలాహలంగా మార్చాయి.
ప్రతి సంవత్సరం ఈ ఉత్సవానికి ముఖ్య అతిథులుగా నల్లాల ఓదల్, భాగ్యలక్ష్మి విచ్చేస్తారు. తెలంగాణ ధూమధామ్ డ్యాన్సర్లు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా సహకరించారు.
అనారోగ్యాలు లేకుండా ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని భక్తులు వేడుకున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com