గోల్కొండలో జగదాంబిక ఎల్లమ్మకు రెండో బోనం, సికింద్రాబాద్ ఉజ్జైని మహంకాళి ఘటోత్సవం ప్రారంభం
తెలంగాణలో బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆషాడ మాసం తొలి ఆదివారం సందర్భంగా హైదరాబాద్లోని గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబికా ఎల్లమ్మ తల్లికి భక్తులు రెండో బోనం సమర్పించారు.
మహిళలు బోనాలతో ఆలయానికి చేరుకోగా, శివశత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మికంగా మారింది. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
సికింద్రాబాద్లోని ఉజ్జైని మహంకాళి అమ్మవారి ఘటోత్సవాలు కూడా ప్రారంభమయ్యాయి. ఎదుర్కోలు ఘటోత్సవంతో బోనాల ఉత్సవానికి అంకురార్పణ జరిగింది. పుష్పగిరి పీఠాదీశ్వరులు శ్రీ విద్యాశంకర భారతీ మహాస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు, స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com