అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన: న్యాయమూర్తుల నివాసాలు, సొంత ఇంటి పనుల పరిశీలన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించారు. న్యాయమూర్తుల నివాస ప్రాంగణం, ఎన్జీఓ భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు.
పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం తాము నిర్మించుకుంటున్న సొంత ఇంటి పనులను సతీసమేతంగా పరిశీలించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com