అల్లూరి జిల్లాలో గంజాయి నిర్మూలనకు ‘పల్లెబాటలో ఈగల్’ కార్యక్రమం ప్రారంభం
గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించేందుకు ఈగల్ బృందం ‘పల్లెబాటలో ఈగల్’ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఈ కార్యక్రమాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లా, డుమ్రిగూడ మండలం, కుర్రాయి కొత్తవరస గ్రామంలో ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో యువత గంజాయి పండించాలనే ఆలోచన రాకుండా వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా చైతన్యం తీసుకువస్తామని తెలిపారు.
గత రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో జిల్లాలో గంజాయి సాగు సున్నా స్థాయికి చేరిందని, అదే తరహాలో ఈ ఏడాది కూడా కొనసాగించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఆయన చెప్పారు.
‘పల్లెబాటలో ఈగల్’ ద్వారా ఈగల్ బృందాలు ప్రతి గ్రామాన్నీ సందర్శించి గిరిజనులతో సమావేశాలు నిర్వహిస్తాయి. గంజాయికి సంబంధించిన సమాచారం అందించేందుకు ప్రత్యేక నంబరును కూడా ప్రజలకు అందించనున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com