ఏలూరు జిల్లాలో దారుణం: దుప్పటి కోసం అడిగిన బాలికను రాత్రికే హాస్టల్ నుండి పంపించిన వార్డెన్
ఏలూరు జిల్లా చింతలపూడిలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఒక బాలికను దుప్పటి కోసం అడిగినందుకు రాత్రి 9 గంటలకు బయటకు పంపించినట్లు తెలిసింది.
ఎనిమిదో తరగతి చదువుతున్న అక్షయ అనే విద్యార్థిని కప్పుకోవడానికి దుప్పటి అడిగింది. దీంతో ఆగ్రహించిన వార్డెన్ స్వప్న అమ్మాయిని రాత్రి బయటకు పంపించింది.
విద్యార్థినిని గదిలో ఉండకుండా గేటు దగ్గరకు పంపించగా, తల్లితండ్రులు రాత్రి 11 గంటలకు వచ్చి ఇంటికి తీసుకెళ్లారు. హాస్టల్ వాచ్మెన్ రాణి తనను తిట్టి, జుట్టు పట్టుకొని కొట్టినట్లు అక్షయ ఆరోపించింది.
ఈ ఘటనపై అక్షయ తల్లితండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డెన్ స్వప్నపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై అధికారుల స్పందన తెలియాల్సి ఉంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com