హైదరాబాద్లో కల్తీ ఆహారంపై దాడులు – 6 మంది అరెస్ట్
హైదరాబాద్ నగరంలో కల్తీ ఆహార తయారీ, విక్రయాలపై సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్ (H-FAST), GHMC ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. బహదూర్పుర, కిషన్ బాగ్, సికింద్రాబాద్, మలకాజగిరి, బేగం బజార్ ప్రాంతాల్లోని ఆరు ఆహార తయారీ, విక్రయ కేంద్రాలపై ఈ దాడులు జరిగాయి. నిబంధనలు ఉల్లంఘించి ప్రజారోగ్యానికి ముప్పు కలిగించిన కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు.
తనిఖీలో అనేక విస్మయకర వివరాలు వెలుగు చూశాయి. ఆహార తయారీ స్థలాల్లో బొద్దంకలు, పావురాలు తిరుగుతూ అత్యంత అపరిశుభ్ర వాతావరణం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాడిన వంట నూనెను పదేపదే వాడుతున్నారు, ప్రమాదకర కృత్రిమ రంగులు కలుపుతున్నారు, గడువు ముగిసిన ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ఈ వ్యాపారాలకు కనీస FSSAI లైసెన్స్ కూడా లేదని తేలింది.
దాడి అనంతరం టాస్క్ ఫోర్స్ DCP గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ మాట్లాడుతూ, నగరంలో ఎక్కడైనా ఇలాంటి కల్తీ ఆహారం లేదా అపరిశుభ్ర తయారీ కనిపిస్తే వెంటనే H-FAST టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై అధికారులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com