అరుణాచల్లో 27 ప్రాంతాలకు అధికారిక పేర్లు ఖరారు చేసిన భారత్
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అరుణాచల్ ప్రదేశ్లోని 27 కీలక ప్రాంతాలకు అధికారిక ప్రామాణిక పేర్లను ఖరారు చేసింది. సర్వే ఆఫ్ ఇండియా అధికారిక మ్యాప్లో ఈ పేర్లను నమోదు చేస్తూ ప్రకటన విడుదల చేసింది.
ఈ 27 ప్రాంతాల్లో 21 భూభాగాలు, నాలుగు కీలక పర్వత కనుమలు, ఒక సరస్సు, ఒక సైనిక స్మారక చిహ్నం ఉన్నాయి. 1959లో చైనా దాడులు మొదలైన లాంగ్జూ ప్రాంతం, 1962 యుద్ధంలో భారత వీరులు పోరాడిన టాగ్ కనుమ, జస్వంత్గఢ్, షేరియా థాపా స్మారకం, సాంభో సరోవనం వంటి వ్యూహాత్మక ప్రాంతాలు ఇందులో ఉన్నాయి.
చైనా 2015 నుండి దాదాపు 112 భారతీయ ప్రాంతాలకు చైనీస్, టిబెటన్ పేర్లను విధించడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అరుణాచల్ను దక్షిణ టిబెట్గా పేర్కొంటూ చైనా భూభాగాలపై దావా వేస్తున్న నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ చర్యపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి స్పందిస్తూ, ఇది భారత ప్రభుత్వం చేసుకుంటున్న ఆత్మవంచన అని, సరిహద్దు సమస్యలను మరింత క్లిష్టం చేస్తుందని వ్యాఖ్యానించారు. అలాగే అరుణాచల్ ప్రదేశ్ను తాము గుర్తించబోమని, ఈ ఏకపక్ష నిర్ణయంతో చట్టబద్ధమైన స్థితి మారదని చెప్పారు.
భారత్ మాత్రం ఈ విమర్శలను తోసిపుచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగమని, పేర్ల మార్పుతో క్షేత్రస్థాయి వాస్తవాలు మారవని న్యూఢిల్లీ స్పష్టం చేసింది. ఈ పేర్ల కారారు ప్రక్రియ ఆయా ప్రాంతాల్లో పరిపాలన, మౌలిక సదుపాయాలు, విపత్తు నిర్వహణ పటిష్టం చేయడంతోపాటు భారత సార్వభౌమాధికారాన్ని ప్రపంచానికి తెలియజేస్తుందని అధికారులు వివరించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com