రాంచీ JSCA స్టేడియంలో తొక్కిసలాట: పలువురికి గాయాలు, ఆస్పత్రులకు తరలింపు
రాంచీలోని JSCA ఇంటర్నేషనల్ స్టేడియంలో జార్ఖండ్ టీ20 లీగ్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఊహించని విధంగా భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించేలా అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఇర్ఫాన్ అన్సారి తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com