కైలాష్ యాత్రకు పర్మిట్, వీసా తప్పనిసరని ట్రావెల్ ఆపరేటర్ సూచన
కైలాష్ మానసరోవర్ యాత్రకు వెళ్లే భక్తులు పర్మిట్, వీసా ప్రక్రియ పూర్తి కాకుండా బయల్దేరితే ఇబ్బందులు తప్పవని ట్రావెల్ ఆపరేటర్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తెలిపింది. చైనీస్ ఎంబసీ నుంచి ఇన్విటేషన్ లెటర్ రావడం, గ్లోబల్ వెరిఫికేషన్ జరగడం, ఆపై ఢిల్లీ ఎంబసీ నుంచి వీసా స్టాంపింగ్ అయి ఒరిజినల్ పాస్పోర్టులు తిరిగి రావడం పూర్తయిన తర్వాతే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.
ఈ ప్రక్రియ అన్ని ఏర్పాట్లు అయిన తర్వాత హైదరాబాద్ నుంచి ఖాట్మండు లేదా నేపాల్కు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవాలని ఆపరేటర్ వివరించింది. ఇప్పటివరకు తమతో వెళ్లిన 500 మందికి పైగా భక్తులు వీసా లేదా పర్మిట్ సమస్యలతో సరిహద్దు వద్ద ఆగిన చరిత్ర లేదని, వాతావరణం వల్ల మాత్రమే ఆలస్యం కావచ్చని పేర్కొంది.
ఇతర ట్రావెల్ ఆపరేటర్లతో వెళ్లేవారు కూడా తమకు ఒరిజినల్ పర్మిట్, వీసా స్టాంపింగ్ పూర్తిగా అయ్యాయో లేదో నిర్ధారించుకున్నాకే బయల్దేరాలని సూచించింది. పత్రాలు లేకుండా వెళ్లి హోటళ్లలో చిక్కుకోవద్దని హెచ్చరించింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com