పార్వతీపురం మన్యం: నది దాటితే తప్ప బయట ప్రపంచం లేదు; రోడ్డు, వంతెన కోసం గ్రామస్తుల నిరీక్షణ
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం కంటిగూడు గ్రామస్తులు రహదారి సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామం నుంచి బయటకు వెళ్లాలంటే స్థానికంగా ప్రవహించే ఒక ఏరును దాటాల్సిన పరిస్థితి ఉంది.
వర్షాకాలంలో ఏరు ఉదృతంగా ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయని గ్రామస్తులు తెలిపారు. దశాబ్దాలుగా ఈ సమస్య కొనసాగుతోంది. పలుమార్లు అధికారులకు వినతులు ఇచ్చినా ప్రయోజనం లేకపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
“పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం. బడికి వెళ్లాలన్నా, అంగడికి వెళ్లాలన్నా ఏరు దాటుకోవాలి. 30, 40 ఏళ్లుగా రోడ్డు సౌకర్యం లేదు” అని ఓ గ్రామస్తుడు చెప్పారు.
వెంటనే రహదారి నిర్మించాలని, ఏరు మీద వంతెన లేదా కల్వర్టు నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com