లోక్సభ మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లుకు ఆమోదం
గురువారం లోక్సభలో మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లు ఆమోదం పొందింది. విపక్షం నిరసనల మధ్య వాయిస్ ఓటుతో ఈ బిల్లు పాస్ అయింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ప్యానెల్ స్పీకర్ అధ్యక్షతన జరిగిన ఈ బిల్లుకు అనుకూలంగా మెజారిటీ సభ్యులు ఓటు వేశారు. ప్రతిపక్ష నేతలు అఖిలేశ్ యాదవ్, కేసీ వేణుగోపాల్ తదితరులు నిరసనలు తెలిపారు. ఇక రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టనున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com