పాల్ఘాట్ జిల్లాలో భారతదేశపు మొదటి సముద్ర ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రణాళిక
మహారాష్ట్ర ప్రభుత్వం పాల్ఘాట్ జిల్లాలోని కోరే బీచ్ వద్ద సముద్రంలో ఎయిర్పోర్ట్ నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇది భారతదేశంలో తొలి offshore విమానాశ్రయం కానుంది. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ. 45 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.
ఇందులో సముద్రాన్ని పూడ్చి భూమిని సృష్టించేందుకు రూ. 25 వేల కోట్లు, విమానాశ్రయ నిర్మాణానికి రూ. 20 వేల కోట్లు కేటాయించనున్నారు. విమానాశ్రయం నుంచి ఏటా 28 వేల మెట్రిక్ టన్నుల కార్గో రవాణా చేసే లక్ష్యంగా ప్రతిపాదించారు.
ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఈ ఏడాదిలోపు డీపీఆర్ (వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక) తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఎయిర్పోర్ట్ను మాధవన్ పోర్ట్తో అనుసంధానించి, మెట్రో, ఎక్స్ప్రెస్ హైవేలతో కూడా కలపాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుతం ముంబై ఎయిర్పోర్ట్లో రద్దీ ఎక్కువగా ఉండడంతో అంతర్జాతీయ స్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ కొత్త విమానాశ్రయం వల్ల ముంబై మీద ఒత్తిడి తగ్గుతుందని ప్రభుత్వం పేర్కొంది. జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఇప్పటికే సముద్రంలో ఎయిర్పోర్ట్లను నిర్మించాయి.
కోరే బీచ్లో నిర్మాణం పూర్తయితే భారతదేశంలో ఇదే మొదటి offshore విమానాశ్రయం అవుతుంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com