CA ఫౌండేషన్: మాస్టర్ మైండ్స్ విద్యార్థులకు ఆల్ ఇండియా 5, 8 ర్యాంకులు
ICAI ప్రకటించిన CA ఫౌండేషన్ పరీక్ష ఫలితాల్లో హైదరాబాద్లోని మాస్టర్ మైండ్స్ శాఖ విద్యార్థులు M. సజ్ఞా ఆల్ ఇండియా 5వ ర్యాంకు, L. ఆకాష్ 8వ ర్యాంకు సాధించారు.
హైదరాబాద్ బ్రాంచ్ ప్రిన్సిపాల్ S. వెంకటేశ్వరరావు, అకాడెమిక్ ప్రిన్సిపాల్ ఆంజనేయ రెడ్డి, అశోక్లు ఈ ఫలితాల వివరాలు వెల్లడించారు. ఈ బ్రాంచ్లో CA ఫౌండేషన్ పరీక్ష రాసిన విద్యార్థుల్లో 50 శాతానికి పైగా ఉత్తీర్ణత సాధించినట్టు వారు తెలిపారు.
8వ ర్యాంకు సాధించిన విద్యార్థి L. ఆకాష్ మాట్లాడుతూ, తన విజయానికి తల్లిదండ్రులు, ఫ్యాకల్టీ, మాస్టర్ మైండ్స్ మేనేజ్మెంట్ సహకరించాయని చెప్పారు. ఇన్స్టిట్యూట్ నుంచి కోచింగ్ తీసుకుంటున్న క్రమంలో రివిజన్ పరీక్షలు, స్టడీ మెటీరియల్ బాగా ఉపయోగపడిందని తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com