ఒంగోలు: చెరువుకొమ్మపాలెంలో ఆరేళ్ల బాలుడు మృతదేహం లభ్యం
ఒంగోలు మండలం చెరువుకొమ్మపాలెంలో ఆరేళ్ల రిచర్డ్ అనే బాలుడు మృతదేహం చెరువులో లభ్యమైంది.
రిచర్డ్ ఆటిజం, వినికిడి, మాటల సమస్యలతో బాధపడుతున్నాడు. సోమవారం తల్లి ప్రత్యూషతో కలిసి దుర్గా నర్సింగ్ కళాశాలకు వచ్చాడు. ఆమె అక్కడ ప్రిన్సిపాల్గా బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆడుకుంటూ కాలేజీ గేటు నుంచి బయటకు వచ్చాడు. వాచ్మెన్ అరవటంతో భయపడి అక్కడి నుంచి పరిగెత్తాడు.
చుట్టుపక్కల దుకాణంలో చాక్లెట్లు కొన్న తర్వాత ముందుకు వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు, స్థానికులు చాలాసేపు గాలించారు. తాలూకా పోలీసులు 20 బృందాలుగా ఏర్పడి డ్రోన్లు, సీసీ కెమెరాలు, డాగ్ స్క్వాడ్ సాయంతో వెతికారు. చీకటిపడటంతో సోమవారం ఫలితం లభించలేదు.
మంగళవారం ఉదయం పోలీసులు దగ్గరలోని చెరువులో బాలుడి మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. కొత్త ప్రాంతం కావడంతో రిచర్డ్కు దారి తెలియక చెరువులోకి దిగి ఉంటాడని, ఈత రాకపోవడంతో మునిగి మృతి చెందాడని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com