పవన్ కల్యాణ్ గ్రామాల్లో పారిశుద్య, సీజనల్ వ్యాధుల నివారణపై సమీక్ష
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో పారిశుద్య నిర్వహణ, సీజనల్ వ్యాధుల నివారణపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
అన్ని గ్రామాల్లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం విజయవంతంగా అమలయ్యేలా చూడాలని, పారిశుద్యం కోసం బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ బిళ్ళలు తగిన మోతాదులో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
తాగునీరు, పారిశుద్య నిర్వహణ, దోమల నియంత్రణ చర్యలపై కూడా చర్చించారు. సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపులు, మైక్ అనౌన్స్మెంట్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com