ఘట్కేసర్లో CM రేవంత్కు నిరసన, రుణమాఫీ డిమాండ్ చేస్తూ నినాదాలు
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో సోమవారం అందిశ్రీ స్మృతివనం శంకుస్థాపన కార్యక్రమంలో CM రేవంత్ రెడ్డి ప్రసంగిస్తుండగా నిరసన వ్యక్తమైంది. BJP మేడ్చల్ రూరల్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ప్రవీణ్ రుణమాఫీ రాలేదని నినాదాలు చేశారు.
అప్రమత్తమైన పోలీసులు వెంటనే ప్రవీణ్ను బయటకు తరలించారు. సమస్యల పరిష్కారం కోసం CMకు వినతిపత్రం ఇవ్వబోయిన కొంతమంది రియల్టర్లను కూడా పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లారు.
నిరసన అనంతరం CM మాట్లాడుతూ, తెలంగాణ సమాజం ఇలాంటి ఆటంకాలను ఎదుర్కొని ముందుకు సాగుతుందని వ్యాఖ్యానించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com