సికింద్రాబాద్ మహంకాళి బోనాలకు విస్తృత భద్రతా ఏర్పాట్లు
సికింద్రాబాద్ ఉజ్జైని మహంకాళి బోనాల ఉత్సవాలకు పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. నార్త్ జోన్ డిసిపి రక్షిత కృష్ణమూర్తి ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు.
భక్తులకు సౌకర్యం కోసం జోగినీలకు ప్రత్యేక ప్రవేశం కల్పించారు. బోనం తీసుకొచ్చే మహిళలు, సాధారణ భక్తులు, పాస్ హోల్డర్ల కోసం వేర్వేరు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.
రంగం రోజున స్వర్ణలతకు ప్రత్యేక భద్రత, భక్తులకు త్వరగా దర్శనం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు డిసిపి తెలిపారు.
జోగినీలతో సమన్వయ సమావేశం నిర్వహించిన డిసిపి, వారికోసం మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు టైమింగ్ ను నిర్ణయించారు. వారికి బాటా సైడ్ నుండి ప్రత్యేక ఎంట్రీ ఇవ్వనున్నారు. అదనంగా జోగినీల భద్రత కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి ఎస్ఐ ర్యాంక్ అధికారిని నియమించామని చెప్పారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com