వరంగల్ భద్రకాళి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు ఐదవ రోజు; భక్తుల పోటెత్తి
వరంగల్లోని భద్రకాళి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు నేడు ఐదవ రోజుకు చేరుకున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారు ఉదయం విరోధిని క్రమంలో దర్శనమిచ్చారు. సాయంత్రం వహిని వాసిని క్రమంలో అలంకరణలో భక్తులకు అభయం ఇవ్వనున్నారు.
ఆదివారం సెలవు దినం కావడంతో కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకుడు మాట్లాడుతూ, శాకాంబరి నవరాత్రి ఉత్సవాలు 15 రోజుల పాటు జరుగుతాయని, ఈ నెల 29వ తేదీ పౌర్ణమి నాడు ముగుస్తాయని తెలిపారు.
ఆషాడ మాసంలో జరిగే ఈ ఉత్సవాలు మంచి వర్షాలు, పంటలు కావాలని ప్రార్థించేందుకు నిర్వహిస్తారని ఆయన వివరించారు. భక్తులు తమకు ఇష్టమైన కూరగాయలను అమ్మవారికి సమర్పించి ఆరాధిస్తారు. పౌర్ణమి ముందురోజు సమర్పించిన కూరగాయలతో అమ్మవారిని అలంకరిస్తారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com