మహారాష్ట్రలోని సౌందాల గ్రామం కులరహితంగా ప్రకటన
మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లాలోని సౌందాల గ్రామ ప్రజలు కుల వివక్ష లేని గ్రామంగా ప్రకటించారు. గ్రామ ప్రజలు సమావేశమై ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేశారు. ఇకపై గ్రామంలో స్కూల్, దేవాలయం, నీటి వనరులు, స్మశానం వంటి అన్ని సౌకర్యాలు అన్ని కులాల వారికి సమానంగా అందుబాటులో ఉంటాయి. 'మా కులం మానవత్వం' అనేది వారి నినాదం. ఈ తీర్మానం ద్వారా కుల విభజన లేకుండా అందరం కలిసి జీవించాలని నిర్ణయించారు. ఈ తీర్మానం అమలు ఎంత వరకు సాధ్యమవుతుందనేది చూడాలి.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com