జాట్ ట్రైలర్ లాంచ్లో నాన్న ధర్మేంద్ర గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురైన సన్నీ డియోల్
బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ తన తాజా చిత్రం 'జాట్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో భావోద్వేగానికి గురయ్యారు. ట్రైలర్ లో ఇంట్రడక్షన్ పార్ట్ లో తన తండ్రి, లెజెండరీ నటుడు ధర్మేంద్ర పేరు వచ్చినప్పుడు సన్నీ డియోల్ కంటతడి పెట్టుకున్నారు. ధర్మేంద్ర పేరు ప్రస్తావన రాగానే సన్నీ చాలా సేపు మాట్లాడలేకపోయారు. 'నేను నాన్నను ఎప్పుడూ అలాగే చూస్తుంటాను' అని ఆయన క్లుప్తంగా స్పందించారు. తండ్రీ కొడుకుల బంధం సినీ ప్రేక్షకులను కూడా కదిలించింది. ఈ ఈవెంట్ లో సన్నీ డియోల్ హీరోయిన్ సయామీ ఖేర్, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కూడా పాల్గొన్నారు. 'జాట్' చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com