హైదరాబాద్ NPA లో ట్రైనీ IPS అధికారి ఉదయ కృష్ణా రెడ్డి పై లైంగిక వేదింపుల కేసు నమోదు
హైదరాబాద్ లోని నేషనల్ పోలీస్ అకాడమీ (NPA) లో ట్రైనీ IPS అధికారి ఉదయ కృష్ణా రెడ్డి పై లైంగిక వేదింపుల ఆరోపణలతో అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సహచర మహిళా ట్రైనీ IPS అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, ఉదయ కృష్ణా రెడ్డి ఆమెను గదిలో బంధించి, మెడపై కత్తి పెట్టి బెదిరించాడు. అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు, ఆమె వ్యక్తిగత వీడియోలు తీసి భర్తకు పంపించాడు. తోటి ట్రైనీ అధికారితో తనకు ప్రేమాయణం నడుస్తోందంటూ విష ప్రచారం చేశాడని కూడా ఆమె పేర్కొన్నారు.
ఉదయ కృష్ణా రెడ్డి గతంలో కానిస్టేబుల్గా పనిచేసి, పై అధికారి తనను చులకనగా చూశాడనే కోపంతో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత సివిల్స్ కు ప్రిపేర్ అయ్యి మొదటి ప్రయత్నంలోనే మంచి ర్యాంక్ సాధించి IPS అయ్యారు.
ఈ ఘటనపై NPA అధికారులు తీవ్రంగా స్పందించారు. అత్తాపూర్ పోలీసులు బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసి, ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితుడి ప్రవర్తనకు గల కారణాలు, ఇద్దరి మధ్య వ్యక్తిగత తగాదాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com