APS RTC JAC తో ప్రభుత్వ చర్చలు విఫలం, ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరిక
APS RTC జేఎసి (JAC) నాయకులతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. డిమాండ్ల పరిష్కారంపై ఎలాంటి హామీ ఇవ్వలేదని, దీంతో ఉద్యమ కార్యచరణ యథావిధిగా కొనసాగుతుందని జేఎసి నేతలు ప్రకటించారు.
ప్రధానంగా APS RTC ప్రైవేటీకరణను నిలిపివేయాలని, పెండింగ్లో ఉన్న డియరెన్సు (DA), పీఆర్సీ (PRC) బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో సంస్థను పరోక్షంగా ప్రైవేటీకరించే విధానాలను ఆపాలని కోరారు. ఈ అంశంపై ఓ మంత్రి ప్రైవేటీకరణ పదమే లేదని చెప్పినా, ఉద్యోగులు మాత్రం ప్రైవేటీకరణ భయం తొలగలేదని జేఎసి నేతలు స్పష్టం చేశారు.
చర్చలు విఫలం కావడంతో నిరసన కార్యక్రమాలు ముమ్మరం చేస్తామని జేఎసి ప్రకటించింది. ఈ నెల 9 నుంచి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలిసి తమ డిమాండ్లు వివరించనున్నారు. 19 నుంచి సంతకాల సేకరణ చేపట్టి, 27వ తేదీన కలెక్టర్కు గ్రీవెన్స్ ఇవ్వనున్నారు. నెలాఖరు లోపు భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు.
ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, ఉద్యోగుల ప్రైవేటీకరణ భయాన్ని తొలగించకపోతే, రాబోయే రోజుల్లో ప్రత్యక్ష కార్యాచరణకు దిగాల్సి వస్తుందని జేఎసి హెచ్చరించింది. APS RTC ఉద్యోగుల నిరసనలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com