హైదరాబాద్ జీడిమెట్లలో గంజాయి మత్తులో కారు డ్రైవర్పై దాడి
హైదరాబాద్ జీడిమెట్లలోని భాగ్యలక్ష్మి కాలనీలో గంజాయి మత్తులో ఉన్న 10 మంది యువకులు ఒక కారు డ్రైవర్పై దాడి చేశారు. రోడ్డుపై వెళ్తున్న డ్రైవర్ను ఆపిన యువకులు గంజాయి కావాలని డిమాండ్ చేశారు.
డ్రైవర్ తన దగ్గర గంజాయి లేదని చెప్పడంతో ఆగ్రహించిన యువకులు బీరు సీసాలతో దాడి చేశారు. ఈ దాడిలో డ్రైవర్ తలకు గాయమైంది. చేయి విరిగింది.
దెబ్బలు తట్టుకోలేక డ్రైవర్ పక్కనే ఉన్న తన రూమ్కు పరిగెత్తుకెళ్లాడు. యువకులు అంతటితో ఆగకుండా అతని ఇంటి దగ్గరకు వెళ్లి మళ్లీ దాడి చేశారు. దాడి దృశ్యాలు సమీపంలోని CCTV కెమెరాల్లో రికార్డయ్యాయి.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు విచారణ చేపట్టారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com