జాతీయం

వాణిజ్య, పారిశ్రామిక LPG వినియోగదారులకు కేంద్రం నుంచి ఆంక్షల ఎత్తివేత

రచన: ఉషా కిరణం డెస్క్ ·
వాణిజ్య, పారిశ్రామిక LPG వినియోగదారులకు కేంద్రం నుంచి ఆంక్షల ఎత్తివేత
📷 Tejash Mishra / Pexels
షేర్ కాపీ అయింది ✓

కేంద్ర ప్రభుత్వం వాణిజ్య, పారిశ్రామిక ఎల్పిజీ వినియోగదారులకు పెద్ద ఊరటనిస్తూ పలు ఆంక్షలను ఎత్తివేసింది.

గృహేతర ప్యాక్డ్ ఎల్పిజీ, బల్క్ కమర్షియల్ గ్యాస్ సరఫరాపై ఇప్పటివరకు అమల్లో ఉన్న అన్ని రంగాల వారీ ఆంక్షలను తక్షణమే ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆంక్షలను పశ్చిమాసియా సంక్షోభానికి ముందున్న స్థాయికి పునరుద్ధరించింది.

పశ్చిమాసియా సంక్షోభం సద్దుమణిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సంక్షోభం సమయంలో నిలిపివేసిన బల్క్ ఎల్పిజీ సరఫరాపై 50% వరకూ సడలింపు ఇచ్చింది.

పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ప్రకారం, సంక్షోభం సమయంలో ఎల్పిజీ ఉత్పత్తిని పెంచేందుకు పెట్రో కెమికల్, ఇతర రంగాల నుంచి C3, C4 స్ట్రీమ్లను తరలించి నిత్యవసర వస్తువుల చట్టం కింద ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం దేశీయంగా ఎల్పిజీ ఉత్పత్తి మెరుగుపడడం, దిగుమతులు పెరగడంతో ఈ మల్లింపును తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే దేశీయ ఎల్పిజీ లభ్యతకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రోజువారీ ఉత్పత్తి కనీసం 40 టిఎంటి (TMT) వరకూ కొనసాగించేలా చూస్తూ, నాన్-ఎల్పిజీ అవసరాల కోసం C3, C4 స్ట్రీమ్ల కేటాయింపు పెంచనున్నట్లు మంత్రిత్వ శాఖ వివరించింది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com